వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మంచన్ పల్లి, మాదారం గ్రామాలలో బుధవారం బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోదరి మీరా బిజెపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్, తదితరులు పాల్గొన్నారు.