ఆర్థిక సహాయం అందజేత

50చూసినవారు
ఆర్థిక సహాయం అందజేత
కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామానికి చెందిన బంటు సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న కె ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్, శ్రీనివాస్, శివ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్