ఏపీ అభివృద్ధిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన్ను చంద్రబాబు కలిశారు. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. వికసిత్ ఏపీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రగతిపై సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీలతో చర్చించామని తెలిపారు. కాగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఏపీ విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాలకు నిధులపై చర్చించారు.