భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్.. రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలను విలన్లుగా పేర్కొన్నారు. వీరు హర్యానాకు, ముఖ్యంగా అథ్లెట్లకు విలన్లుగా మారారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెజ్లర్లు నిరసన తెలపకపోతే పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఐదు రెజ్లింగ్ పతకాలు సాధించి ఉండేదని ఆయన అన్నారు. వినేష్, బజరంగ్ శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.