పౌరులు ట్రాఫిక్ రూల్స్ను అనుసరించాలని పోలీసులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ, బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించింది. ఆమె ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు సంబంధించిన దృశ్యాలు నగరంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో పోలీసులు పలుమార్లు పెండింగ్ జరిమానాలు రూ.1.36 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు పంపారు.