బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. 39 మంది మృతి

57చూసినవారు
బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. 39 మంది మృతి
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసలో ఇప్పటివరకు 39 మంది ఆందోళనకారులు మరణించారు. మరో 2,500 మందికి పైగా గాయపడ్డారు. గురువారం ఒక్కరోజే 19 మంది ఆందోళనకారులు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ రిజర్వేషన్లను రద్దు చేసి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి వర్సిటీల విద్యార్థులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్