ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. అయితే ఈవీ కార్లు అమ్మకాలపరంగా వెనుకంజలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ సూపర్ మైలేజ్ ఫీచర్స్తో నయా ఈవీను మార్కెట్లో లాంచ్ చేయనుంది. వోక్స్వ్యాగన్ ఐడీ 3 జీటీఎక్స్తో ఈవీ వాహన విభాగంలోకి ప్రవేశించనుంది. ముఖ్యంగా ఈ కారు రెండు ట్రిమ్లలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.