'వ్యూహం' నిర్మాత పిటిషన్‌.. కోర్టు కీలక నిర్ణయం

578చూసినవారు
'వ్యూహం' నిర్మాత పిటిషన్‌.. కోర్టు కీలక నిర్ణయం
‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా విడుదలపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నిర్మాత పిటిషన్‌ వేశారు. సినిమా విడుదల కాకపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను సింగిల్‌ బెంచ్‌ ఈనెల 11కు వాయిదా వేసిందని తెలిపారు. స్పందించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌లోనే తేల్చుకోవాలని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్