విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం 'సైంధవ్' కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, వెంకీ మామ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్, విలన్ రోల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు.