Mar 28, 2024, 17:03 IST/డోర్నకల్
డోర్నకల్
ఎమ్మెల్యే పై తప్పుడు కథనాలు సరికాదు
Mar 28, 2024, 17:03 IST
సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కాంగ్రెస్ పాటుపడుతోందని, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ పాలనలో బూత్ స్థాయి కార్యకర్తకు కూడా పనులు ఇచ్చారని కాంగ్రెస్ మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి గురువారం మరిపెడ సమావేశంలో అన్నారు. ప్రజల కోసం అహర్నిషలు పని చేస్తున్న ఎమ్మెల్యే పై తప్పుడు కథనాలు రాయటం సరికాదన్నారు. కథనం రాసిన వారిపై చట్ట రీత్యా, న్యాయ శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.