Jul 27, 2024, 00:07 IST/జనగాం
జనగాం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం
Jul 27, 2024, 00:07 IST
జనగాం జిల్లా బచన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ని నిరసిస్తూ మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బచన్నపేట కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని నిరసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.