తెలంగాణ రైతు సంఘం జనగామ పట్టణ కార్యదర్శి, సిపిఎం జనగామ పట్టణ కమిటీ సభ్యులు కామ్రేడ్ మంగ బీరయ్య తండ్రి మంగ ఉప్పలయ్య(90) మృతి చెందారు. మంగళవారం ఉదయం మృతి చెందిన ఉప్పలయ్య మృతి పట్ల సిపిఎం పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నందున సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.