జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నట్లు కార్యాలయ ఇంఛార్జ్ తెలిపారు. గురువారం దర్శనం అనంతరం చేర్యాల పట్టణ కేంద్రంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం 11: 00 గంటలకు జనగామ పట్టణం చేరుకొని అక్కడ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని వివరించారు.