ఉత్తరప్రదేశ్ లో మత కార్యక్రమంలో 116 మంది మృతి చెందిన సంఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య డిమాండ్ చేసారు. బుధవారం జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లోని హద్రాస్ జిల్లా ఫుల్ రయీ గ్రామంలో భోలే బాబా దర్శనం సందర్భంగా జరిగిన సంఘటన అత్యంత విషాదకరమన్నారు.