మహబూబాబాద్ జిల్లా లోని మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్ కు శనివారం నుంచి మూడురోజులు పాటు సెలవులు ప్రకటించినట్టు మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండుగ సందర్బంగా 26, 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. మార్కెట్ లేని సమయంలో రైతులు తమ సరుకులను విక్రయానికి తీసుకొచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. అక్టోబర్ 28 తిరిగి ప్రారంభమవుతుందని, ఈ విషయాన్నీ రైతులు గమనించాలని పేర్కొన్నారు.