గౌతమి ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాద ఘటన జరిగి బుధవారం నాటికి పదకొండు ఏళ్ళు. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల మధ్య 2008జులై 31న అర్ధ రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటనలో 30మంది సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన జరిగి పదకోండు ఏళ్ళు అవుతున్న స్థానికులు మదిలో ఆనాటి అర్ధదానాలు మాత్రం చెరిగిపోలేదు.