పగలు ఎండ వేడిమితో అల్లాడిన జనానికి సాయంత్రం వేల ఉరుములు మెరుపులు ఈదురు గాలలతో కురిసిన వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, పలు కొనుగోలు కేంద్రాలలో విక్రయానికి ఉంచిన వరి ధాన్యం మొక్కజొన్న తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిందని రైతులు కన్నీరు మున్నీరయ్యారు.