మహబూబాబాద్ జిల్లా కేసముద్రం నుండి తొర్రర్ కు వెళ్లే రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కులు చూపిస్తోంది. నెక్కొండ క్రాస్ నుండి రోడ్డు పూర్తిగా పాడైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఈ గుంతలు ఏర్పడి దాదాపు 2సం గడుస్తున్నా.. పట్టించుకునే నాధుడు లేడని ప్రయాణికులు, స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.