మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే మురళీ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి

63చూసినవారు
మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే మురళీ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి
మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే మురళీ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న గూడూరు మండలం పోనుగోడు గ్రామానికి చెందిన సంగెం మణికంఠ , నీల అరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్