మంత్రి సత్యవతి రాథోడ్ కి ఘనస్వాగతం

302చూసినవారు
మంత్రి సత్యవతి రాథోడ్ కి ఘనస్వాగతం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవి వచ్చాక తొలిసారిగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రాగ ఎమ్మెల్యే, ఏంపీ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బొకే స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలు ర్యాలీ తీస్తూ బాణాసంచా పేలుళ్ల మధ్య మంత్రికి స్వాగతం పలకగా గిరిజన నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం ముత్యాలమ్మ దేవాలయంలో పూజలు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించింది. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ అశీసులతో మంత్రి పదవి వచ్చిందని, కష్టపడిన ప్రతీ కార్యకర్తను సీఎం గుర్తిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, హరిప్రియలు, జెడ్పి చైర్మన్ బిందు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, ఎంపీపీలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయం... బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం.. http://bit.ly/2nocNBQ
టెన్త్ పాసైన నిరుద్యోగులకు తీపికబురు.. https://bit.ly/2mRWY5S

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్