ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం పోలారం గ్రామానికి చెందిన మహమ్మద్ గౌసియా రషీద అనే దంపతుల ఇల్లు గత కొన్ని రోజులు నుండి కురుస్తున్న వర్షాల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు.