తాడ్వాయి మండలంలో ముందు లారీని ఢీకొన్న వెనుక లారీ

64చూసినవారు
తాడ్వాయి మండలంలో ముందు లారీని ఢీకొన్న వెనుక లారీ
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో రెండు ఇసుక లారీలు ఢీ కొన్న ఘటన చోటుచేసుకుంది. తాడ్వాయి పస్రా గ్రామాల మధ్య లవ్వాల స్టేజి సమీపంలోని జనగలంచ బ్రిడ్జిపై శనివారం ముందు వెళ్తున్న ఇసుక లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి వచ్చిన మరో ఇసుక లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్