కమలాపురంలో వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

64చూసినవారు
కమలాపురంలో వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గురువారం గ్రామంలోని లోకేష్ అనే బాలుడిని కరిచి గాయపరిచాయి. కాలు, ఇతర చోట్ల తీవ్రంగా కరిచాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా గ్రామంలో వీధి కుక్కలు, కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాటిని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్