మంగపేట మండలంలో కమలాపురానికి చెందిన నిఖిత గోదావరి నది వద్దకు తండ్రితో వెళ్ళింది. నిఖిత తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న కుమార్తె చేయి అందించి బయటకు లాగింది. ఈ క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.