ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్, లంబాడితండా, పప్కాపూర్, భీంనగర్ గ్రామ ప్రజలకు పంచాయతీ కార్యదర్శి, అధికారులు గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన బాండ్ పేపర్స్ శనివారం పంపిణీ చేశారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.