ఘనంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

55చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ద్వారకాపేటలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు సుదర్శన నరసింహ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణంతో పాటు సమీప గ్రామాలకు చెందిన పలువురు భక్తులు ఈ హోమంలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నరేందర్ గుప్తా, కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్