శివపార్వతుల ముద్దుల కొడుకు గజాననుడి జననం

76చూసినవారు
శివపార్వతుల ముద్దుల కొడుకు గజాననుడి జననం
కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, తల స్నానం చేయటానికై వెళ్తూ, నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ద్వారం వద్ద కాపలా పెట్టి, లోపలికి ఎవరినీ అనుమతించ వద్దని చెప్పింది. అదే సమయంలో శివుడి ఇంటికి రాగా, తల్లి ఆజ్ణ మేరకు ఆ బాలుడు శివుడిని రానివ్వలేదు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు ఆ బాలుడి తలను నరికాడు. ఇదంతా చూసిన పార్వతిదేవీ ఎంతో దుఃఖించగా.. శివుడు గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు.

సంబంధిత పోస్ట్