బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని మాజీ మంత్రి, జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పాలకుర్తిలో ఆయన మాట్లాడుతూ కొంత మంది కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను నమ్మి కార్యకర్తలు మోసపోకూడదని, పాలకుర్తి, వర్ధన్నపేట పార్టీ కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని చెప్పారు.