ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం

76చూసినవారు
జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలను నిర్వహించారు. గురువారం పాలకుర్తి రాజీవ్ చౌరస్తా వద్ద రుణమాఫీ ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్