సకాలంలో సాగునీరు అందక ఎండిన పంటపొలాలను పరిశీలించి, ఇబ్బందులను తెలుసుకుని రైతులను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓదార్చారు. ఈ మేరకు ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి దేవరుప్పుల మండలం దరావత్ తండాలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సాగునీటి ప్రణాళిక ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో పంటలు ఎండినట్లు తెలుస్తోందన్నారు.