జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట హైస్కూల్లో 2002-2003 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి విద్యా బోధన చేసిన గురువులను ఘనంగా సన్మానించారు. ఆనాడు తాము పాఠశాలలో చేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.