బీఆర్ఎస్ నేతలు సంస్కారం, సభ్యత లేకుండా తన గురించి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పల్లా రాజేశ్వరరెడ్డి వంటి నేతలు బిఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించకపోతే జనగాం చౌరస్తాలో బట్టలు ఊడదీసి నిలబెడతానని హెచ్చరించారు. మనవరాలి వయసున్న మహిళ చేతిలో చావు దెబ్బతిన్నా సిగ్గు లేదా అని ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రశ్నించారు.