అక్రమంగా తరలిస్తున్న 21 గోవులు పట్టివేత
బక్రీద్ నేపథ్యంలో మాంసం విక్రయాల కోసం వరంగల్ శంభునిపేటకు చెందిన యాకూబ్పాషా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొమ్మాల ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన ఆవులు తీసుకువచ్చినట్లు సమాచారం అందడంతో సోమవారం పోలీసులు దాడి చేశారు. 21 ఆవులను స్వాధీనం చేసుకొని గోశాలకు తరలించారు. యాకూబ్ పాషాపై కేసు నమోదు చేసినట్లు మిల్స్ కాలని సీఐ మల్లయ్య తెలిపారు.