వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో 76 అర్జీలను అందజేశారు.