హనుమకొండ: సీనియర్ జర్నలిస్టు గుండెపోటుతో కన్నుమూత

64చూసినవారు
హనుమకొండ: సీనియర్ జర్నలిస్టు గుండెపోటుతో కన్నుమూత
హనుమకొండకు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయకపు సుభాష్ హఠాన్మరణం చెందారు. రెండు రోజులుగా ఛాతినొప్పితో బాధపడుతున్న ఆయనకు సోమవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుభాష్ మృతి వార్తతో జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భీమారంలోని ఆయన నివాసానికి చేరుకున్న తోటి జర్నలిస్టులు భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్