దేశంలోని అనేక రాష్ట్రాలు ఎండతీవ్రత, వేడిగాలుల కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావడం మానేశారు. కన్నౌజ్లోని ఉమ్ర్దా బ్లాక్లోని మహసౌనాపూర్ ప్రాంతంలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు స్కూల్కు రావడానికి ప్రిన్సిపాల్ వైభవ్ సింగ్ రాజ్పుత్ పరిమిత వనరులతో పిల్లల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. దీంతో స్కూల్కి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.