పదేళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 'అధికారంలో ఉన్నప్పుడే చేయని బీఆర్ఎస్ ఇప్పుడెలా చేస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయి. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు లేవు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి' అని అన్నారు.