'మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్‌ ఇలా

415159చూసినవారు
'మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్‌ ఇలా
సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర రేపటి(శుక్రవారం) షెడ్యూల్‌ను YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ఉదయం 9 గం. ఎస్‌టీ రాజపురం నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట, ఉందురు, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గం. కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పలు గ్రామాల మీదుగా వెళ్ళి గొడిచర్ల లోని రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్