38 కేసులు నమోదు చేశాం: తెలంగాణ సీఈవో

76చూసినవారు
38 కేసులు నమోదు చేశాం: తెలంగాణ సీఈవో
తెలంగాణలో పోలింగ్ కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ శాతం బాగానే నమోదైందన్నారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా ఓటర్లు క్యూ కట్టారని తెలిపారు. వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తామని తెలిపారు. కొన్ని చోట్ల ఈ ప్రక్రియ అర్థరాత్రి ఒంటిగంట వరకు కొనసాగే అవకాశం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్