ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. జనరల్ కోచ్లు లేని రైళ్లకు 2 కోచ్లు, 2 బోగీలున్న రైళ్లలో 4 బోగీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,377 స్లీపర్ క్లాస్ కోచ్లు, అదనంగా 2,500 జనరల్ బోగీలను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఒక్కో కోచ్లో 150-200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు తెలిపింది.