గుడ్ న్యూస్.. రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంపు

61చూసినవారు
గుడ్ న్యూస్.. రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంపు
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. జనరల్ కోచ్‌లు లేని రైళ్లకు 2 కోచ్‌లు, 2 బోగీలున్న రైళ్లలో 4 బోగీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,377 స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు, అదనంగా 2,500 జనరల్‌ బోగీలను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఒక్కో కోచ్‌లో 150-200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్