మా ఇష్టపూర్వకంగానే ఇళ్ళు ఖాళీ చేశాం: మూసీ బాధితులు

77చూసినవారు
మలక్‌పేట పరిధిలోని శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్‌లో ఇండ్లను నిర్వాసితులు ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే తమ ఇష్టపూర్వకంగానే ఇళ్లు ఖాళీ చేశామని నిర్వాసితులు బుధవారం తెలిపారు. వర్షం వచ్చినపుడు అక్కడ ఇళ్లలోకి వరద నీరు చేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మురికి వల్ల తమ పిల్లలు అనారోగ్యానికి గురయ్యేవారని అన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించడంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కి ఋణపడి ఉంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్