కర్ణాటక రాజకీయాల్లో లైంగిక దౌర్జన్యం కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అతడిని భారత్కు తీసుకొస్తామని రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర సోమవారం తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన సిట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.