వంద రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్సభలో ప్రధాని మోడీ సోమవారం మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370కి పైగా స్థానాలు ఖాయమని, ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో తాము తిరిగి అధికార పగ్గాలు చేపట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటామని మోడీ అన్నారు.