పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం: ఆస్పత్రి సూపరింటెండెంట్

2245చూసినవారు
పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం: ఆస్పత్రి సూపరింటెండెంట్
శ్రీజ(బేబీ)కి పూర్తిగా నెలలు నిండకుండానే నొప్పులు రావడంతో 16న ఆసుపత్రిలో చేర్చుకొని వైద్య సేవలందించినట్లు వర్థన్నపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహస్వామి తెలిపారు. ’17న మళ్లీ నొప్పులు రావడంతో మధ్యాహ్నం సాధారణ ప్రసవం చేశాం. ఆ సమయంలో శిశువుకు శ్వాసకు సంబందించిన సమస్య రావడంతో చికిత్స అందిస్తూనే మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించాం. శిశువు మృతి చెందడంలో మా నిర్లక్ష్యం లేదని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం‘ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్