నీరు విడుదల చేయకపోవడంపై సుప్రీంకి వెళ్తాం: ఆతిశీ

72చూసినవారు
నీరు విడుదల చేయకపోవడంపై సుప్రీంకి వెళ్తాం: ఆతిశీ
ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఆప్ మంత్రి ఆతిశీ యమునా రిజర్వాయర్‌ను పరిశీలించారు. యమునా నదిలో నీటి మట్టం తగ్గడంతో నగరానికి సరిపడా నీరు లభించడం లేదని ఆమె చెప్పారు. హర్యానా నుంచి ఢిల్లీకి నీటి వాటా విడుదల చేయకపోవడం వల్ల సమస్య తీవ్రమైందని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని ఆమె తెలిపారు. అలాగే నీటి వాటాను విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్