పేదవాడికి నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నామని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మొదట 183 అన్న క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. త్వరలో మరో 20 అన్న క్యాంటీన్లను తెరుస్తామని హామీ ఇచ్చారు. ‘వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా మార్చాం. వైద్యులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఆ పేరును మార్పు చేశాం’ అని వివరించారు.