తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం: అమిత్ షా

83చూసినవారు
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం: అమిత్ షా
తెలంగాణలో బీజేపీ 10 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ, ఒడిశాలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అటు దక్షిణాదిలోని 5 రాష్ట్రాలు, తూర్పు భారత్ (బెంగాల్, ఝార్ఖండ్, బిహార్, ఒడిశా)లో తాము అతిపెద్ద పార్టీగా నిలుస్తామన్నారు. 2014, 2019 తరహాలో ఈసారి కూడా విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ 400 సీట్లు సాధిస్తామని ఆశాభాం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్