ఇటీవల ముగిసిన జీ7 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ట్రూడో ప్రకటించారు. ‘భారత్-కెనడా మధ్య ఉన్న సున్నితమైన అంశాల గురించి నేను ప్రస్తావించను. కానీ రెండు దేశాలు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయి’ అని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాతి నుంచి ఇరు దేశాల మధ్య బంధం క్షీణించిన సంగతి తెలిసిందే.