ముస్లీంలు శాంతి పూర్వకంగా మసీదులలో ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ముస్లీంలు తమ ఇంట్లో పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ తీపి వంటలను హిందువులు, పేద ప్రజలకు పంపిణీ చేస్తారు. కొత్త బట్టలు ధరించి నమాజ్ చేస్తారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటూ ఈద్ముబారక్ తెలుపుకుంటారు.