1974లో కచ్చతీవును కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుందని, 1976లో చేపలవేటపై కూడా హక్కులు వదులుకున్నారని కేంద్రం వాదిస్తోంది. అందుకు ఆధారాలు ఉన్నాయని కేంద్రమంత్రులు చెప్తున్నారు. 20ఏళ్లలో వేలమంది మత్స్యకారులను, బోట్లను శ్రీలంక అదుపులోకి తీసుకుందని కేంద్రం చెప్తుంది. భారతీయ మత్స్యకారులను విడుదల చేసేలా కృషి చేస్తున్నామని, ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జైశంకర్ చెప్పారు.